CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.

Share it:



మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండల కేంద్రంలో  సిఐ టీయు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది, ఈ సమావేశం లో సి ఐ టీ యు  మండల కార్యదర్శి  యల్ పీ ముత్యాలు మాట్లాడుతూ  నరేంద్రమోడీ నాయకత్వంలో  కేంద్రం , బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అష్టకష్టాలు పడుతున్నాయి ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయి ,ప్రజల హక్కులు హరించబడ్డాయి.. అందుకే  కార్మికులు , రైతులు, సామాన్య ప్రజానీకం, ప్రజాస్వామ్య, రాజ్యాంగ  హక్కుల మీద దాడిని తిప్పికొట్టాలి. సులభతరం వ్యాపారం అనే పేరుతో తన విధానాలను కొన సాగిస్తున్న ఫలితంగా దేశంలో అశాంతి, అసంతృప్తి మిగిలాయి అని  సీఐటీయూమండలం కార్యదర్శి  యల్ పీ ముత్యాలు అన్నారు .తదనంతరం   యస్ యఫ్ ఐ   జిల్లా అధ్యక్షులు,  తోకల రవి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం  వ్యవసాయ విధానాన్ని ధ్వంసం చేసి, 

, ఆహార భద్రతను దెబ్బతీసినదని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబానికి  ఇప్పుడు ఇస్తున్న రేషన్ ఒక్కరికి పది కేజీల బియ్యం తో పాటు 7500/రూపాయలు నగదు  ఇవ్వాలని నిరంతరాయంగా ఇవ్వాలని  తోకల రవి డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా సీఐటీయూ నాయకులు వెంకటరెడ్డి, వసంతరావు, పోస్ట్ మాన్ శ్రీను,  ప్రభావతి, నర్సమ్మ, యల్ పీ ముత్యాలు, తోకల రవి తదితరులు  సమావేశం లో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: