\👉ఎన్డీ దళ కమాండర్ యాకయ్య ను తక్షణమే కోర్టులో హాజరు పరచాలి.
గుండాల మన్యం టీవీ: పోలీసులు అరెస్టు చేసిన ఎన్డీదళ కమాండర్ యాకయ్యను తక్షణమే కోర్టులో హాజరు పర్చాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, జెడ్పిటిసి వాగబోయిన రామక్క న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కొమరం సత్యనారాయణ అన్నారు. గురువారం ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పేదలకు, ఆదివాసి గిరిజనులకు తోడుగా వెన్నంటి ఉన్నాడన్నారు. దళ కమాండర్ యాకయ్య అనారోగ్యంతో గత కొంత కాలంగా బాధపడుతూ మాణిక్యారంలో తన ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా బుధవారం రాత్రి నిద్ర పోతున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారని, తక్షణమే అరెస్టు చేసిన దళ కమాండర్ యాకయ్యను కోర్టుకు హాజరు పర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, ఆళ్లపల్లి న్యూ డెమోక్రసీ మండల నాయకులు హనుమంతు, బత్తిని సత్యం, పాయంసత్యం, ఉప్పయ్య, పాల్గొన్నారు.
Post A Comment: