ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర ఆస్తుల నమోదు రద్దు స్టే పట్ల హర్షం
ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం మణుగూరుడివిజన్ అధ్యక్షులు పోలేబోయిన అనిల్ కుమార్
మన్యం టీవి, పినపాక:
ఈ - పంచాయితీ పోర్టల్ "లో గిరిజనేతర వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం మణుగూరుడివిజన్ అధ్యక్షులు పోలేబోయిన అనిల్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మన్యం టీవి తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతర వ్యవసాయేతర ఆస్తుల నమోదు పక్రియ (మెరూన్ కలర్ పట్టాల మంజూరు)ను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టు స్టే స్పష్టంగా విధించడం జరిగిందన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో "1/70" చట్టానికి వ్యతిరేకంగా వ్యాసయేతర ఆస్తులు నమోదు చెయకుదని గిరిజన సంఘాలు ,ఆదివాసీ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించడం తో ప్రభుత్వం సైతం పురలోచోన చెయ్యడం హర్షణీయం అన్నారు.
Post A Comment: