డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీపావళి మరుసటిరోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ స్పీడ్ పెంచింది. డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందుకుకారణం లేకపోలేదు... ఎందుకంటే దుబ్బాక ఎన్నికలో అధికార పార్టీ పరాభవం చెందింది. దుబ్బాక ఎఫెక్ట్ పడక ముందు గ్రేటర్ ఎన్నికలు జరపాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఈక్రమంలో మరికాసేపట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణ, ఓటర్ లిస్ట్, వార్డులపై చర్చ జరుగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఈసీ పరిశీలించనుంది. ఎన్నికల కోసం సిబ్బందికి శిక్షణను పూర్తి చేసింది. కరోనా నిబంధనలతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేయనుంది. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Navigation
Post A Comment: