మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు సేవా దృక్పథంతో మణుగూరు నందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు లో అనేక రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం నిరంతరం కృషి చేసిన ఆయనకు అమితమైన గౌరవాన్ని ఇచ్చి తన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించటం పట్ల సంతోషాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిప్పిన సిద్దులు ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ నేడు విద్యార్థులు సేవా దృక్పథం కలిగి లేకపోవడం చాలా విచారంగా ఉందని తెలిపారు.మణుగూరు డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుఉండటం సంతోషంగా ఉంది అని తెలిపారు.డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని మరియు మొక్కలు నాటడం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందకరమైన విషయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదె మాధవరెడ్డి, అధ్యాపకులు. శ్రీమతి పావని, రామతిరుపతి, సాంబమూర్తి,శరణ్య,దేవుల తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: