CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన బీఈడీ కళాశాల అవకతవకలపై ఏసీబీ సీఐ విచారణ

Share it:

 


గిరిజన బీఈడీ కళాశాల అవకతవకలపై ఏసీబీ సీఐ విచారణ

* ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు అధ్యాపకులను విచారించిన ఏసీబీ 

* భద్రాచలం ఐటీడీఏ పీవో నుండి సైతం వివరాల సేకరణ?

*అక్రమార్కులకు బిగిస్తున్న ఉచ్చు


మన్యం టీవి, పినపాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  భద్రాచలం గిరిజన కళాశాలలో  జరిగిన అవకతవకలపై  బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో లో లో భద్రాచలం  గిరిజన బీఈడీ అక్రమాలపై ఏసీబీ సిఐ స్థాయి అధికారి సోమవారం అధ్యాపకులను విచారించారు. ఈ విచారణ ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమై రెండు గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది ఈ విచారణలో ఉపాధ్యాయులను ఏసీబీ అధికారులు విద్యార్థుల స్కాలర్షిప్ కుంభకోణం గిరిజన పాఠశాలల్లో అక్రమ పద్ధతులు నియామకం పొందిన అధ్యాపకుల వివరాలు విద్యార్థుల హాస్టల్ వసతి ల్యాబ్ ఫండ్స్ గోల్మాల్ తదితర అంశాలపై అధ్యాపకులను ప్రశ్నించినట్లు తెలియవచ్చింది అలాగే ఐటీడీఏ పీవో నుండి సైతం సంబంధిత కళాశాలకు సంబంధించిన ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారం రోజుల్లో లో విచారణ వివరాలు పూర్తిగా బహిర్గతం కానున్నాయి దీనితో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి

Share it:

TELANGANA

Post A Comment: