CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జెడి ఫౌండేషన్, పరశురాం పరివార్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం

Share it:



మన్యం టీవీ, బూర్గంపాడు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లోని వినాయకుని ఆలయం వద్ద జెడి ఫౌండేషన్  సహకారంతో పరశురాం పరివార్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం మీద ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరశురాం పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్  మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు మొదటగా వినాయకుని దర్శించుకుని గుడి ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ గ్లాసులను, కవరులను తీసి గుడి ని శుభ్రంచేసే ఒక మంచి కార్యక్రమం ను ప్రారంబించడం జరిగింది అని, తల్లి గర్భం లో మనం ఎంత పవిత్రంగా ఉంటామో, గుడిని కూడా అంతే పవిత్రంగా చూసుకునే భాద్యత ప్రతి ఒక్క భక్తుడికి ఉందని, అందుకే ఈ కార్యక్రమం ను మొదటగా వినాయకుని ఆలయం నుండి మొదలు పెట్టాము అని ఆయన అన్నారు. ఈరోజు నుండి సారపాక పరిసర ప్రాంతంలో ప్లాస్టిక్ మీద మా పరశురాం పరివార్ పోరాటం కొనసాగుతుంది అని, హిందూ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల తో పాటు, ప్లాస్టిక్ మీద మా పోరాటం ఉంటుంది అని, మంచి కార్యక్రమాలతో ముందుకు వేళతాము అని, ఇంత మంచి ఆవకాశం కల్పించిన భద్రాచలం జెడీ ఫౌండేషన్ భాద్యులు మురళి, నాగరాజు, సంపత్ కి మా పరశురాం పరివార్ టీం తరపున కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమం లో పరశురాం పరవార్ మండల అధ్యక్షులు ఆశోక్ రెడ్డి, శ్రీను, రాంబాబు, రాజేష్, సమీర్  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: