CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిసెంబర్ 9న జాతీయ రహదారుల దిగ్బంధన : ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ప్రకటన

Share it:

\


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సమావేశం కొత్తగూడెం లోని లక్ష్మీదేవిపల్లి,కొమరం భీమ్ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది.తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప.కోటేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శులు ముక్తి.రాజు,కొడెం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.వారు ఈ సమావేశంలో మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని,పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని,జీవో నెంబర్ 3 కొనసాగించాలని,ఏజెన్సీ లో ఎల్ఆర్ఎస్,ఆర్ఓఆర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్స్ తో జాతీయ రహదారులను డిసెంబర్ 9న దిగ్బంధం చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.గతంలో 2017 డిసెంబర్ 9న రాష్ట్ర రాజధాని హైదరాబాదులో, 2019 డిసెంబర్ 9న దేశ రాజధాని ఢిల్లీలో ఆదివాసీల భారీ సభలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు.అయినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం వలన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జాతీయ రహదారిపై ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు,ప్రజా సంఘ నాయకులు,ఉద్యోగ,ప్రజాస్వామికవాదులు,విద్యార్థి సంఘాల నాయకులు,మహిళా సంఘ నాయకులు అందరూ పాల్గొని సహకరించాలని,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర నాయకులు కల్తి.సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి గోగ్గెల.రామస్వామి,ప్రచార కార్యదర్శి దారబోయిన.రమేష్,ముక్తి.రాజు, ఉండం.కృష్ణ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: