CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాడెడ్లు లేక కానీ భుజాన ఎత్తుకున్న రైతుకు జనతా భీమాతో ధీమా

Share it:




 కాడెడ్లు లేక కానీ భుజాన  ఎత్తుకున్న రైతుకు జనతా భీమాతో ధీమా

గిరిజన రైతు దంపతులకు అండగా నిలిచినజాతీయ మిర్చి డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి 


మన్యం టీవీ మంగపేట. 

పత్తిపొలం సాగుచేసి దుక్కిదున్నటానికి కాడెడ్లు లేక నాగలి కానిని భుజాన వేసుకొని పత్తి చేనులో పై పాటు చేసిన మండలం లోని కొత్తూరు -మొట్లగూడెం గిరిజన రైతు  లొల్లి శంకర్ దంపతులకి "వికాస్ అగ్రి పౌండేషన్ "అండగా నిలిచిందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. ఆదివారం మండలం లోని అఖినేపల్లిమల్లారంలో  వికాస్ అగ్రిఫౌండేషన్ కార్యాలయంలో గిరిజన రైతు దంపతులు లొల్లి శంకర్ దంపతులకు "జనతా భీమా యోజన "బాండ్ ని ఆయన అందజేశారు. ఈ సందర్బంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఇటీవల లొల్లి శంకర్ దంపతులు కాడెడ్లు లేక పడిన కష్టాన్ని వార్తాపత్రికల ద్వారా తెలుసుకొని, గతంలోనే గిరిజన రైతు దంపతులకు అవసరమైన  ఎరువులు, పురుగుల మందులు, నగదు సహాయం అందచేశామని, ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు "ఐదు లక్షల రూపాయల "విలువైన ఉచిత ప్రమాదభీమాని కల్పించినట్లు సాంబశివారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  వికాస్ అగ్రిఫౌండేషన్ డైరెక్టర్లు శేషారెడ్డి, చెట్టిపల్లి తిరుపతిరావు, వికాస్, వివేక్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: