CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

20మందికి ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి ధ్రువీకరణ పత్రాలు అందజేసిన మేము సైతం మిత్ర మండలి

Share it:


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని రామానుజవరం పంచాయతీ లో సోమవారం మేము సైతం మిత్ర మండలి ఆధ్వర్యంలో రామానుజవరం గ్రామంలోని 20మందికి ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించడం జరిగినది అని నేర్చుకున్న వారికి కుట్టుమిషన్ ధృవీకరణ పత్రాలు మేము సైతం మిత్రమండలి ద్వారా అందజేయడం జరిగినది. మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పసునూరి భాస్కర్ మాట్లాడుతూ కుట్టు మిషన్ నేర్చుకున్న వారికీ  వారు సొంతంగా షాపులు ఏర్పాటు  చేసుకోవడానికి అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది అని  తెలియజేయడం జరిగింది. వారికీ భవిష్యత్తు లో ఉపాధి కలిపించే విధంగా కమిటీ పనిచెయ్యడం జరుగుతుంది అని తెలియజేశారు. మరియు అలాగే మరల రెండవ బ్యాచ్ వారికి  కుట్టుమిషన్  2వ తారీకు నుండి  నేర్పించడం జరుగుతుంది అని  తెలియజేయడం జరిగింది. యువతీ,యువకులకు

మేము సైతం మిత్రమండలి ఆధ్వర్యంలో ఉపాథి అవకాశాలు కలిపిస్తూ  మరియు నిరుపేదలకు, వృద్దులకు,అనారోగ్యం తో బాధపడే వారికీ నిరంతరం సేవలు అందిస్తున్న  మేము సైతం మిత్రమండలి కమిటీ సభ్యులకు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.భవిష్యత్తు లో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు,మరియు సేవ కార్యక్రమాలు మేము సైతం మిత్ర మండలి ద్వారా అందజేయవలసిందిగా ప్రజలు కోరారు.ఈ కార్యక్రమం లో మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు  పసునూరి భాస్కర్,ట్రెజరర్ రంగా శ్రీనివాస్,సెక్రటరీ మార్తి శ్రీనివాస్,చిందుకురి ఏడుకొండలు,బొల్లు రామకృష్ణ,పులిగిండ్ల రమేష్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: