- భాజపా ఎన్నికల సంఘం ముందు చేసిన ధర్నా డ్రామా.
- ప్రచారం కోసం 12మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షున్ని, ప్రధాన మంత్రిని కూడా తీసుకొచ్చారు.
- 4 ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా.. ఎన్నికల ప్రచారం ఉండాలి. కానీ బీజేపీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
- ఫేక్ మీడియా నడపడంలో బీజేపీ కి నోబెల్ బహుమతి వస్తుంది.
- దుబ్బాక ఉప ఎన్నికల రోజు కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరుతున్నట్టు ఓ ఛానెల్ లోగోతో తప్పుడు వీడియో సృష్టించి వదిలారు.
- ఇలానే ఈసారి కూడా, నేను, మా కీలక నేతలు పార్టీ మారినట్టు ప్రముఖ ఛానెళ్ల నకిలీ లోగోలతో వీడియోలు తయారు చేయించారు.
- ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో గతంలో జరిగిన మత కల్లోలాలు, ప్రార్ధన మందిరాల్లో మాంసం వేయడం వంటి వీడియోలు మళ్ళీ ఇక్కడ జరిగినట్టు తప్పుడు ప్రచారం చేయబోతున్నారు.
- వీటిపై మాకు స్పష్టమైన సమాచారం ఉంది.
- భాజపా సోషల్ మీడియాను ఫేక్ మెడియగా మార్చింది.
- ఇటువంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- భాజపా దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉంది.
- బీజేపీ ప్రేస్టేషన్ లోకి వెళ్ళింది.
- తెరాస శ్రేణులు సంయమనంతో ఉండాలి.
Post A Comment: