మన్యం టీవీ, బూర్గంపాడు:
మహాత్మా జ్యోతిబా పూలే 130 వర్థంతి కార్యక్రమాన్ని సారపాక గ్రామంలోని భద్రాద్రి జిల్లా బీసీ సంఘం కార్యాలయంలో ఘనంగా జరిపారు.జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు మాట్లాడుతూ... సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధికోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త,మానవతావాది మహాత్మా జ్యోతి పూలే .ఈ రోజులో ప్రతి మహిళా చదువు కుంటుందంటే అది జ్యోతిబా పూలే చలువే అని ,మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను మనం ఆచరిదం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హృదయం వృద్ధాశ్రయం లో వృద్దులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, మండల ఉపాధ్యక్షుడు ఆకుల రఘు, బీసీ సంగం నాయకులు నిదానపల్లి బాలకృష్ణ, గోవింద్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: