మన్యం టీవి, హైదరాబాద్:
జేఈఈ మెయిన్స్ లో తెలంగాణ విద్యార్థులు అద్భుతంగా రాణించారని మంత్రి కేటీఆర్ అన్నారు. మెయిన్స్ విజేతలకు మంత్రి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయి పరీక్ష అయిన జేఈఈలో ప్రతిభ చూపిన రాష్ట్ర విద్యార్థులను అభినందించారు. దేశవ్యాప్తంగా 100 శాతం మార్కులు సాధించిన 24 మందిలో 8 మంది తెలంగాణ విద్యార్థులే ఉండటం గర్వంగా ఉందన్నారు. బాలికల విభాగంలో టాపర్గా నిలిచిన చుక్కా తనూజను మంత్రి అభినందించారు.
Post A Comment: