CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజనులకు అందని రేషన్ బియ్యం రేషన్ డీలర్ చేతివాటం

Share it:

మన్యం టీవి,చర్ల : కరోనా వ్యాధి మూలంగా పేదవాడికి పని లేక తినడానికి తిండి దొరక్క ఆకలి చావులు చస్తున్నారు. ఇది చూసిన రాష్ట్రప్రభుత్వం చెల్లించి కరోనా విపత్కర సహాయంగా ప్రతి పేదవాడికి 10 కిలోల బియ్యం ను పోర్టబులిటీ విధానం ద్వారా రేషన్ దుకాణాల్లో ఉచితంగా అందిస్తుంది. ఆ బియ్యంతోనే అనేకమంది పేదవాళ్ళు ఆదివాసీ గిరిజనులు పొట్ట నింపుకుంటున్నారు. ఇలా పేదలకు ఇచ్చే ఈ బియ్యాన్ని కూడా లబ్ధిదారులకు తెలియకుండా హైదరాబాదుకు చెందిన ఓ రేషన్ డీలర్ పోర్టబులిటీ విధానాన్ని ఆసరాగా చేసుకుని మూడు నెలల నుండి పేదలకు దక్కవలసిన బియ్యంను తినేస్తున్నాడు.ఇలా ఇప్పటి వరకూ చర్ల మండలంలోని తిప్పాపురం ఎర్రపాడు రేషన్ షాప్ ల పరిధిలో సుమారుగా 140 కార్డుదారుల కు చెందిన 55 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఈ డీలర్ దోచుకున్న టు తెలుస్తోంది. పేదవాళ్లు, ఆదివాసీ గిరిజనులు కు ఏమి తెలియదు అనే ధోరణితో ఆదివాసి గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వాళ్లకి వచ్చే అధిక రేషన్ బియ్యాన్ని పోర్టబులిటీ విధానం ద్వారా ఈ డీలరు దోచుకుంటున్నాడు.ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి అని గిరిజనులు అన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: