మన్యం టీవి :
ఉమ్మడి చెక్ పవర్ తో పనులలో పారదర్శకత పెరిగింది అని సీతంపేట ఉప సర్పంచ్,ఉపసర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కొండేరు నాగభూషణం శుక్రవారం మన్యం మీడియాతో అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు ఉప సర్పంచులు భేదాభిప్రాయాలు లేకుండా అభివృద్ధి పనులలో ముందుకు సాగుతున్నారన్నారు.ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుమండల ఉప సర్పంచ్ ల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన జనరంజక పథకాలు ప్రజల మన్ననలు పొందడంతో పాటు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు .సీతంపేట పంచాయితీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నయని, తమ పంచాయతీ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న సహాయసహకారాలు ఈ సందర్భంగా కొనియాడారు.
Navigation
Post A Comment: