మన్యం టీవి :
పెసా చట్టం అమలు తో ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి :ఎంపిపి గొంది వాణిశ్రీ.
ఆన్లైన్ విద్యా విధానం పై అవగాహన కలిగి ఉండాలి :కొమురం ప్రభాకర్ జిల్లా పెసా కో-ఆర్డినేటర్
ఏటూరునాగారం:తాడ్వాయి మండల కేద్రంలో కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించికొని సర్పంచులు ,మొబిలైజర్లకు పేసా చట్టంపై సమావేశము నిర్వహించారు. ముందుగా కాళోజి చిత్ర పటానికి తాడ్వాయి మండల ఎంపిిప గొంది వాణిశ్రీ పులమాలతో నివాళులు అర్పించారు. అనంతరం ములుగు జిల్లా పెసా కో-ఆర్డినేటర్ మాట్లాడుతూ ఐటిడిఎ పీవో ఆదేశాల మేరకు మన గ్రామాల్లో ఆన్లైన్ విద్యా విధానం పై ఆయా గ్రామాలలో గల విద్యార్థుల కు ,తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ,సర్పంచులు కు ,మొబిలైజర్ల కు సూచించారు. జాతి పిత గాంధీ జయంతి ని పురస్కరించికొని ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతూ పెసా గ్రామ సభలు తప్పకుండా నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ ముసాయిదా కొరకు షెడ్యూల్ గ్రామాల సర్వే నివేదిక చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ఆంజనేయ ప్రసాద్ , భాస్కర్ ,సర్పంచులు చిడం బాబురావు ,గడ్డం అరుణ ,ఎల్లబోయిన జానకి ,పెసా కమిటీ మండల అధ్యక్షుడు అళ్ళెం నవీన్ ,కార్యదర్శి కొమరం చంద్రయ్య ,నగేష్ ,చేర్ప రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: