మన్యం టీవి :
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ తాటి వెంకటేశ్వర్లు పిలుపుమేరకు వీఆర్వో వ్యవస్థ రద్దుకై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పై రైతులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ములకలపల్లి సెంటర్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు .తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆ వ్యవస్థ అవినీతితో కూరుకుపోయిన దని ముఖ్యమంత్రి కెసిఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి తెలంగాణ లోని రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామ వ్యవస్థ రద్దు ఒక్కటే మార్గమని తెలంగాణలోని రైతులందరి కళ్ళలో ఆనందాన్ని చూడాలని రైతు ఆనందంగా ఉంటేనే బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని భావించి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ తాటి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉండగా సమయాభావం వల్ల హాజరు కాలేకపోయారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు ఎంపీపీ మట్ల నాగమణి సొసైటీ డైరెక్టర్ చీకటి ప్రకాష్ ఏఎంసి మాజీ చైర్మన్ తానం లక్ష్మి సర్పంచ్ కేసరి శ్రీనివాస్ ఉప సర్పంచ్ శనగ పాటి అంజి ప్రధాన కార్యదర్శి శెనగ పాటి రవి సున్నం వెంకటేశ్వర్లు బయట రాము కోండ్రు సుందరావు మేకల వెంకన్న సర్పంచి గడ్డం భవాని అనంతుల మహేష్ ఆంగోతు సుధాకర్ తానం కృష్ణ పుప్పాల చందర్రావు పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
Post A Comment: