మన్యం టీవి :
అవినీతిమయమైన రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన నే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో ల వ్యవస్థను రద్దు చేసి నూతన చట్టం ఏర్పాటుకానుండడం పట్ల పినపాక మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలోఎడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో బుధవారం భారిగా బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించి, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడారు. పాత రెవెన్యూ చట్టం లో అనేక లోసుగులు ఉండడం మూలంగా భూముల రికార్డు కుసంబంధించి పనుల లో జాప్యం చోటు చేసుకునేదన్నారు. నూతనంగా ఏర్పాటుకానున్న రెవెన్యూ చట్టం దేశంలోనే అత్యంత పటిష్టంగా ఉండడమే కాకుండా భూరికార్డుల సంబంధించిన పనులు వేగంగా జరిగే వీలుందన్నారు . ఈ సందర్భంగా నూతన రెవెన్యూ చట్టం ఏర్పాటు పట్ల ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర వర్మ ,రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , ఎంపీటీసీ, సర్పంచులు కొండేరు రాము,కాయం శేఖర్, బాడీస మహేష్ , కృష్ణంరాజు సునీల్ సాంబశివరావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉడుముల లక్ష్మారెడ్డి, దాట్ల వాసు బాబు, కటకం గణేష్ ,సోంపల్లి తిరుపతి ,నరేష్ రెడ్డి, పోలిశెట్టి సత్తిబాబు యువజన విభాగం మండల ఉపాధ్యక్షులు చెన్నకేశవులు,పాయంన నరేష్ దొర ,కొమరం సందీప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: