ములుగు: పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి అన్నారు. అదనపు కలెక్టర్ ఏటూరునాగారం మండలంలో పర్యటించి పనుల పురోగతిపై తనిఖీలు చేపట్టారు. మండలంలోని ఏటూరునాగారం, కోయగూడ, రామన్నగూడెం, రొహీర్, శంకర్రాజుపల్లి గ్రామాలలో పర్యటించి, రైతు వేదికల, వైకుంఠదామాలు, ఇంకుడుగుంతలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు, పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. భూ సమస్యలు ఉన్నచోట సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి పరిష్కరించాలన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణ పురోగతిని ప్రతిరోజు సమీక్షించాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం కావున వ్యక్తిగత శ్రద్ధ తో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, లక్ష్య సాధనలో వెనుకబడ్డ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Navigation
Post A Comment: