మన్యం టీవి ,
తెలంగాణలో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. జిల్లాలోని చర్ల, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. వరుస ఘటనల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కొద్దిరోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించారు. ఘటనా స్థలం నుంచి కొందరు మావోయిస్టుల పారిపోయారన్న సమాచారంతో.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జులై 15న కూడా భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఒకరు గాయపడగా.. 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మరోసారి ఎన్కౌంటర్ జరగడంతో.. మావోయిస్టుల ఏరివేతపై పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మరోవైపు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కొద్దిరోజుల నుంచి తెలంగాణ డీజీపీ రహస్య పర్యటనలు జరుపుతున్నారు. మావోయిస్టుల కదిలికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆరా తీస్తున్నారు.
Navigation
Post A Comment: