CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీలపై పోలీస్ అటవీశాఖ అధికారుల దాడులు నిలిపివెయ్యాలి

Share it:



మన్యంటివి, పాల్వంచ: 
 పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై పోలీస్ అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని.... లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని ఆదివాసీ సంఘాల జేఏసీ చైర్మన్ దాట్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. పాల్వంచ మండల పరిధిలోని గుట్ట గూడెం శివారులో ఇటీవల దాడులు జరిగిన ప్రదేశాన్ని  ఆయన సందర్శించారు. రైతులు సాగు చేసుకుంటున్న పొలాలను పరిశీలించి సంఘీభావం ప్రకటించారు.ఆగస్టు 26న ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పంటభూములు లోకి పోలీస్ అటవీశాఖ సిబ్బంది ప్రవేశించి భూములను లాక్కుని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అదేరోజు తెల్లవారుజాము నుండే దౌర్జన్యంగా ఇళ్ళలో ప్రవేశించి సాగు దారులపై అక్రమ అరెస్టుకు తెరలేపారని ఆరోపించారు.పోడు సాగుదారులపై వెంటనే దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని ఆయన స్పష్టం చేశారు. గుట్ట గూడెం ఘటనను అసెంబ్లీలో చర్చించాల్సిన గా కోరినట్లు తెలిపారు .ఆయన వెంట సంఘ జిల్లా చైర్మన్  వాగబోయిన చంద్రయ్య దొర ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ కె రవి ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్ జ్యోతి మండల అధ్యక్షుడు భాస్కర్ నాగేశ్వరరావు వీర గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: