మన్యం టీవి ,
మణుగూరు :మణుగూరు మండల పరిధిలోని కట్టుమల్లారం పంచాయితి అభివృద్ధి పధంలో ముందుకు వెళ్తోందని సర్పంచ్ జాగిడి జ్యోతి మన్యం టీవీ కి తెలిపారు. పంచాయితి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా సకాలంలో అందుబాటులో ఉంటున్నామన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. పంచాయితీలో పారిశుధ్యం మెరుగు పరుస్తున్నామని, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లడం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చెయ్యడం జరుగుతోందన్నారు పంచాయితీలో త్రాగునీరు వీధిదీపాలు పల్లె ప్రకృతీ వనం పనులు అనుకున్న సమయంలో పూర్తి చెయ్యడం జరుగుతుంది అని మన్యం టీవీ కి తెలియజెయడం జరిగింది
Navigation
Post A Comment: