మన్యం టీవి :
- అభివృది పధంలో కునవరం గ్రామ పంచాయతీ
- మిషన్ భగీరథ కనెక్షన్ల మంజూరు కు సహకరించిన విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కు కృతజ్ఞతలు
- సర్పంచ్ ఏనిక ప్రసాద్
మణుగూరు : మణుగూరు మండలంలోని కునవారం గ్రామ పంచాయతీ అన్ని రంగాలలో అభివృది పధంలో ముందుకి వెళ్తుంది అని సర్పంచ్ ఏనిక ప్రసాద్ మన్యం మీడియాకు తెలియజయడం జరిగింది. పంచాయతీలో 1230 ఇళ్లకు గాను 430 కనక్షన్లు ఇవ్వడంపై సర్పంచు ఏనిక ప్రసాద్ గారు స్పందించి విషయాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకోని వెళ్ళాగా వెంటనే స్పందించి మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి 1230 ఇళ్లకు నీళ్ల కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. స్పందించిన అధికారులు వెంటనే పనులు ప్రారంభించారు ఇప్పటికే 75శాతం పనులు పూర్తి కాగా 25శాతం పనులు జరుగుతున్నవి .పనులను పరిశీలించిన సర్పంచ్ ఏనిక ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,వార్డు మెంబర్లు సమ్మాయ,సురేష్, రాజేశ్వరి,మండల టి ఆర్ ఎస్ నాయకులు రామారావు,టి ఆర్ ఎస్ గ్రామశాఖ బీసీ సెల్ బత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: