మన్యం టీవి : అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏడూళ్ల బయ్యారం రేంజ్ ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల అటవీ శాఖ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో భూ కబ్జాదారులు, స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమరువీరుల చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అటవీ సంరక్ష ణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్టు, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిటీ ప్రెసిడెంట్ గోవిందు, ఎఫ్బీఓ ఎర్రయ్య,లక్ష్మణ్, అశోక్ ,తదితర అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: