CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూపాలపట్నం పంచాయతీ అభివృద్ధి కి నిరంతర కృషి సర్పంచ్ కొరస కృష్ణంరాజు

Share it:

మన్యం టీవి : పినపాక విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతరావు మార్గ నిర్ధేశ్యంలో, సహకారంతో భూపాలపట్నం పంచాయతీ ని లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ..నిరంతరం కృషి చెయ్యడం జరుగుతుందని సర్పంచ్ కొరస కృష్ణంరాజు బుదవారం మన్యం మీడియా తో మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న పలు అభివృద్ధి పనులు తమ పంచాయతీ లో ముమ్మరం కొనసాగుతూ ఉన్నాయన్నారు. వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్ పనులు పూర్తి కాగా,పల్లె ప్రకృతి వనం పనులు సైతం అనుకున్న గడువు లోపే పూర్తి చెయ్యడం జరుగుతుందన్నారు.పంచాయతీ లో పారిశుధ్యం,త్రాగునీటి కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు.భూపాలపట్నం గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు, ముఖ్యంగా గ్రామంలోని వర్షం పడిన ప్రతీ సారి వరద నీరు ఎక్కువ రావడంతో గ్రామస్తులు, ప్రభుత్వ పాఠశాలకు క్రీడా ప్రాగణం లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బంది గా మారిందని ...త్వరలోనే విప్ రేగా కాంతారావు దృష్టికి తమ పంచాయతీకి సంబంధించిన అన్ని ముఖ్య సమస్యలు తీసుక వెళ్లనున్నట్లు ,అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకరానున్న నూతన రెవిన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సర్పంచ్ కృష్ణంరాజు మన్యం మీడియా కు తెలిపారు.
Share it:

TELANGANA

Post A Comment: