మన్యం టీవి :
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం మిట్టగూడెం కళ్యాణపురం లో పర్యటించిన పినపాక నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ మట్టపల్లి సాగర్ యాదవ్ గారు యువజన నాయకులు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు మరియు బురదమయం అయిన రోడ్లను పరిశీలించి తక్షణ చర్యగా పంచాయతీ గ్రాంటు నుండి గ్రావెల్ పోయించి గ్రామస్తులకు కు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆ గ్రామ సర్పంచ్ గారిని సెక్రటరీ గారిని కోరడం తో పాటు గ్రామంలో నెలకొన్న కొన్ని రహదారుల పరిస్థితులు అడిగి తెలుసుకున్న వారు ప్రభుత్వ విప్ శ్రీ రేగాకాంతారావు గారి దృష్టికి తీసుకెళ్లి వారికి వివరించి పరిష్కరించదానికి కృషిచేస్తానని అన్నారు ప్రభుత్వ విప్ శ్రీ రేగాకాంతారావు గారు చేసే అభ్యర్థి కార్యక్రమాలు మరియు యువతకు వారు ఇచ్చే భరోసాను చూసి ఈ రోజు పినపాక నియోజకవర్గ యువత మొత్తం వారివెంటే నడుస్తుందని మనమందరం వారి మడుగులో అడుగేసి మన గ్రామాలు బాగుచేసే భాద్యత యువత మీదనే ఉందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ షోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్యామ్ కుమార్,పద్ధం శ్రీనివాస్, రవి,లంకెల రమేష్,మామిల్ల రాము,వంశీ,మహేష్,కిషన్,జగన్ తదితరులు హాజరయ్యారు.
Navigation
Post A Comment: