గడ్డం పల్లి పంచాయతీ ని ఆదర్శ తీర్చిదిద్దారు ఉంటుంది సర్పంచ్ కలివేటి సునీల్ కుమార్
September 10, 2020
Share it:
మన్యం టీవి :
పినపాక మండల
పరిధిలో ని గడ్డం పల్లి పంచాయతీ నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సహాయ, సహకారాలతో ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా అని సర్పంచ్ సునీల్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కోసం రూపొందించిన అన్ని పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం, త్రాగునీరు ,డ్రైనేజీ ,వీధి లైట్లు ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. గడ్డం పల్లి పంచాయతీలో రెండు కుటుంబాలు వారికి కరోనా సోకడంతో అన్ని విధాలా అండగా ఉండి నిత్యావసర సరుకులు స్పందించి, మనోధైర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. గడ్డం పల్లి పంచాయతీలోని గడ్డంపల్లి-2 లో మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.అలాగే విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండడం మూలంగా విద్యుత్ కుఅంతరాయం ఏర్పడుతుందని, ఇదే విషయాన్ని ప్రభుత్వ విప్ రేగా దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు . నూతన రెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పట్ల సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు.
Share it:
Wanna get our awesome news?
Sign up and get the best viral stories straight into your inbox!
Post A Comment: