మన్యం టీవి :
గుండాల మన్యం టీవీ న్యూస్: ఏజెన్సీలోని నిరుపేద విద్యార్థుల నిరక్షరాస్యతను రూపుమాపాలి అంటే చదువుకున్న ప్రతి విద్యావంతుడు గురువై పేద విద్యార్థులకు విద్యను అందించాలని ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ క్లాసుల విధానం తీసుక రవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులకు టీవీ, మొబైల్ లేకపోవడంతో పాటు అనేక గ్రామాల్లో తరచుగా విద్యుత్తు సమస్యలు ఉంటుంది అన్నారు. దీంతో గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని. విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించిన ఎంపీపీ తనవంతుగా గ్రామీణ విద్యార్థులకు విద్యనందించేందుకు ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం తమ ఇంటి ఆవరణంలో విద్యార్థులకు పాఠాలు బోధించారు.
Navigation
Post A Comment: