మన్యం టీవి,
హైదరాబాద్, : సమర్థతకు పదోన్నతి లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి కాటా ఆమ్రపాలి ప్రధాని కార్యాలయ డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. గతంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా, ఆ తర్వాత జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా పనిచేసిన ఆమ్రపాలి గతేడాది కేంద్ర సర్వీసులోకి వెళ్ళారు. ఇప్పుడు ఆమె ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రెటరీగా నియమితులయ్యారు. 2023 అక్టోబరు వరకు ఆమె ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. అపాయింట్మెంట్స్ కమిటీ నిర్ణయం మేరకు ఆమెకు పీఎంఓలో బాధ్యతలను అప్పగించామని డైరెక్టర్ జె.శ్రీనివాసన్ తెలిపారు. ఆమ్రపాలికి పదోన్నతి పై తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
Navigation
Post A Comment: