మణుగూరు : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన కొత్త రెవెన్యూ చట్టం దేశంలోనే సంచలనం గా మారబోతున్నదని, అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టిఆర్ఎస్ జిల్లా నాయకులు, మణుగూరు జడ్పీటిసి సభ్యులు పోశం నర్సింహారావు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇదే సందర్భంలో ఏజెన్సీ ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పోడుసమస్య కు పరిష్కారం లభిస్తుందని అన్నారు. పోడు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాంతారావు కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎంపిపిలు గాంధీ, కారం విజయకుమారి, సొసైటీ ఛైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, పార్టీ మండల పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: