మన్యం టీవి :
చర్ల మండలం లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు వలన, ప్రాథమిక వైద్య శాల లోనే కాకుండా మండలంలోని గ్రామాలలో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చర్ల మండలం విజయ కాలనీలో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గు, జ్వరం ,గొంతు నొప్పి, వాసన తెలియక పోవడం,రుచి తెలియకపోవడం, విరోచనాలు, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోనీ ఇంటి వద్దే ఉండి మందులు వాడుకొని వ్యాధిని నివారించుకోవచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ప్రజలు కరోనా వ్యాధి ని అరికట్టాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Navigation
Post A Comment: