మన్యం టీవి :
పినపాక మండలం లోని సింగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో రాజ్యసభ సభ్యులు ఎంపీ , టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పిలుపులో భాగంగా గురువారం మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
రాజ్యసభ సభ్యులు , టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ పరిణామం అన్నారు.
మొక్కలు నాటడం వాటిని సం రక్షించడం వల్ల నేలతల్లికి అలాగే మన సమాజానికి ఎంతో ఉపయోగకరమని మానవాళి ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటడం తప్పనిసరి అని ప్రతిఒక్కరు మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల సొసైటీ చైర్మన్ ముదునూరి డాక్టర్ రవిశేఖర్ వర్మ, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కొరస లక్ష్మి రూపవతి, ఉప సర్పంచ్ పొనగంటి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటీ సందీప్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీహరి, స్థానిక వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: