CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిరుపేద వృద్ధాప్యకుటుంబానికి బి. ఎల్. ఏ భరోసా

Share it:

మన్యం టీవి, చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం దానవాయిపేట గ్రామంలోని అతి నిరుపేద కుటుంబానికి చెందిన సోయం వీరయ్య అనే వృద్ధుడు చిన్న ప్రమాదంలో గాయపడి దురదృష్టవశాత్తు బుధవారం కన్నుమూశారు. ఆయన భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక్క పూట కూడా తిండి దొరకని నిరుపేద కుటుంబం. స్థానిక గ్రామస్తులే అప్పుడప్పుడు వారు బాగోగులు చూస్తూ ఉంటారు. దానవైపేట యువత మరియు బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ కార్య నిర్వహణ సభ్యులు తనువు చాలించిన వీరయ్య కు అంత్యక్రియలు చేయడానికి సంసిద్ధులై బాధిత కుటుంబానికి కొంత ఆర్థిక చేయూత నందించారు. బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ కార్యనిర్వహణ సభ్యులు మాట్లాడుతూ....దాతలు ఎవరైనా ఉంటే ఈ నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత లేదా నిత్యావసర సరుకులు గాని అందించగలరని ఆ బాధిత కుటుంబం తరఫున కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్య నిర్వహణ సభ్యులు రూప నాగేష్, నువ్వు శ్రీను, గ్రామ యువత సోయం నరసింహారావు, పవన్, నూప కృష్ణ, పాయం చలపతి, మల్లం ప్రసాదు ,లక్ష్మణ్, రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: