మన్యం టీవీ- అశ్వారావుపేట:- ఆమె కు ముందు తెరాస ప్రభుత్వ సర్పంచ్ గా చేసినా తన భర్త ముద్దిన కొండయ్య కి సహకరిస్తూ చేదోడు వాదోడు గా వుంటూ ప్రజల మన్ననలు పొందారు. తరువాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినది జమ్మిగూడెం పంచాయతీ సర్పంచ్ ఎస్టి మహిళకు రిజర్వ్ కావడం తెరాస అభ్యర్థిగా ఆమెను నిర్ణయించారు. తర్వాత ఎన్నికలు నిర్వహించగా తెరాస అభ్యర్థిగా మిద్దిన రామలక్ష్మి ఎన్నికల భరిలో నిలిచి సర్పంచ్ గా విజయం సాధించారు. తనపై నమ్మకం తో సర్పంచ్ గా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా... అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, హరితహారం విజయవంతంగా నిర్వహిస్తున్న ట్లు ఆమె తెలిపారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తీయించానని, తద్వారా దోమలను నివారించి, విష జ్వరాలు శాతం పూర్తిగా తగ్గిందన్నారు. త్రాగునీటి సరఫరా విజయవంతం గా సాగుతున్నదని, ఇక కరోనా వ్యాధి గ్రామం లోకీ రాకుండా గ్రామం లో షాపులు ఉదయం 6 నుండి 9 గంటలు వరుకు 3గంటలు మాత్రమే తెరిచి ఉంచి తర్వాత మూసి వెయ్యాలి అని నిబంధన వేయించారు, గ్రామం లో ప్రతి కుటంబానికి వెళ్ళి మాస్కులు శానిటైసర్ ఇచ్చాను అని, ఎప్పటికప్పుడే పారిశుధ్య పనులు నిర్వహిస్తూ గ్రామాన్ని నీటిగా ఉంచుతున్నానని తెలిపారు. కరోనా వ్యాధి గురుంచి గ్రామ ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి చైతన్యపరిచారు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తద్వారా ఈ సంవత్సరం లో కనీసం సాధారణ జ్వరం కూడా నమోదు కాకుండా చేసానని తెలిపారు. డంపింగ్ యార్డు పనులు పూర్తి అయినదని, వైకుంటధామం ఆఖరి దశలో ఉన్నదని, పల్లెప్రకృతి వనం పనులు శరవేగంగా అవ్వడానికి కృషి చేస్తున్నాను అని ఆమె మన్యం టీవీ కి తెలిపారు.నూతన రెవిన్యూ చట్టం పట్ల తెరాస ప్రభుత్వ ఆలోచన సరైనదని సర్పంచ్ రామలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. జమ్మిగూడెం గ్రామం లో చదువుకున్న వారు చాలా మంది వున్నా ఒక్కరికి కూడా ఉద్యోగం రాక గ్రామంలో నే కూలి పనులకు పోవడం బాధాకరమని తెలిపారు. విప్ రేగా కాంతారావు సహకారంతో పోడు భూములకు పట్టాలు ఇప్పించే అందుకు కృషి చేస్తానని సర్పంచ్ అన్నారు.
Navigation
Post A Comment: