గుండాల మన్యం టీవీ న్యూస్: డబ్ల్యూ పిఎస్ నేషనల్ ఫోటోగ్రఫీ సలూన్ లో ఆళ్ల పల్లి మండలం లోని మర్కోడు గ్రామానికి చెందిన తాళ్లపల్లి నాగార్జున్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సిల్వర్ అవార్డు సాధించాడు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పడుతున్న ఇబ్బందులు, పనులను గుర్తించి కెమెరా లో బంధించాడు. ఈ క్రమంలోనే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గోండియా సామాజిక తెగకు చెందిన ఓ మహిళ సంకలో పిల్లాన్ని ఎత్తుకొని పోయి లో మంట రగిలించు టకు పొగ గొట్టం తో గాలి ఊగుతున్న దృశ్యాలు తన కెమెరాలో బంధించాడు. ఈ దృశ్యాలు డబ్ల్యూ పిఎస్ నేషనల్ ఫోటోగ్రఫీ సలూన్ లో సిల్వర్ అవార్డుకు ఎంపికయ్యాయి. మారుమూల గ్రామము నుండి జాతీయ అవార్డుకు ఎంపికైన నాగార్జున్ ను పలువురు అభినందించారు
Navigation
Post A Comment: