CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధి పథం లో జానంపేట పంచాయతీ : సర్పంచ్ బాడిశ మహేశ్

Share it:

మన్యం టీవి : జానంపేట పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ట్లు సర్పంచ్ బాడిశ మహేష్ మంగళవారం మన్యం మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆశయాలకు అనుగుణంగా, ఎమ్మెల్యే సూచనలతోపంచాయతీలో విద్య వైద్యం ,డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాల ఏర్పాటు లాంటి సమస్యలపై ఎక్కువ దృష్టి సారించి,వారికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు.ఇప్పటికే జానంపేట పంచాయతీలో రూ.లక్షల తో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి నానాటికీ విజృంభిస్తుండడంతో పంచాయతీ ప్రజలను చైతన్యం చేయడంతోపాటు కరోనా వైరస్ బారిన పడిన కుటుంబాలకు ధైర్యం చెప్పడమే కాకుండా, వారికి ప్రభుత్వ వైద్యశాల నుండి మందులు సక్రమంగా అందేలా చూడడం తో పాటు వీధులలో హైపోక్లోరైట్ ద్రావణం ఎప్పటికప్పుడు పిచికారి చేయడం, బ్లీచింగ్ ముమ్మరంగా చల్లడం జరుగుతుందన్నారు. గిరిజన సొసైటీలు ఏర్పాటుచేసి, నిరుపేద గిరిజనులు ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే జానంపేట పంచాయతీని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు తన శక్తి వంతెన లేకుండా కృషి చేయడం జరుగుతుందని సర్పంచ్ బాడిశమహేష్ మన్యం కి తెలిపారు.
Share it:

TELANGANA

Post A Comment: