మన్యం న్యూస్, మణుగూరు, నవంబర్ 21 నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. ఆయన సోమవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో పీవీ కాలనీకి చెందిన అఫ్జల్ పాషాకు 18,500 ల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమందికి రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయాన్ని అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, వట్టం రాంబాబు, సాగర్ యాదవ్, రమేష్ నాయక్, సృజన్, ముస్లిం మైనార్టీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: