మన్యం న్యూస్, మణుగూరు, నవంబర్ 09 : విద్యార్థి దశ నుంచే విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆయన లంక మల్లారం పంచాయతీ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు విధులను కూడా బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. కళాశాలలో లేదా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా మహిళలు, యువతులు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విజయరావు, ఎంఈఓ వీరస్వామి, న్యాయవాదులు కవిత, రామ్మోహన్ చారి, భాస్కర్, సర్వేశ్వరరావు, వాసవి, శ్రీనివాసరావు, వెంకటరత్నం, సూర్యం తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: