CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సూపర్ స్టార్ కృష్ణకు నివాళులర్పించిన అనంతరం కృష్ణ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Share it:

  


ఈ ఏడాది ఘట్టమనేని ఫ్యామిలీలో ముగ్గురు మరణించడం … ఆ కుటుంబ సభ్యులలో ఎంతగానో కలచివేసింది. ముఖ్యంగా మహేష్ బాబు అయితే కన్నీరు మున్నీరయ్యారు. ఏడాది ప్రారంభంలో అన్నయ్య రమేష్ బాబు ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరా దేవి ఇప్పుడు తండ్రి కృష్ణ మరణించడంతో.. మహేష్ కృంగిపోయాడు. దీంతో మహేష్ పట్ల ఇండస్ట్రీ పెద్దలు పలువురు రాజకీయ నాయకులు సైతం ఎంతగానో ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 నిన్న నానక్ రామ్ గుడాలో కృష్ణ సొంత గృహంలో ఆయన పార్థివదేహానికి చాలామంది ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే బాలకృష్ణ నిన్న హైదరాబాద్ లో లేకపోవడంతో నివాళులు అర్పించడం కుదరలేదు. సోషల్ మీడియా ద్వారా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే ఈరోజు హైదరాబాద్ చేరుకున్న బాలయ్య పద్మాలయ స్టూడియోస్ లో ఉన్న కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. భార్య వసుంధర దేవి మరియు కుమార్తె బ్రాహ్మణితో కలిసి వెళ్లిన బాలయ్య ఘట్టమనేని కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. 

అందరికీ ధైర్యం చెప్పారు. ఇక తీవ్ర ఆవేదనలో అక్కడే ఉన్న మహేష్ బాబుని మరియు ఆయన కుమారుడు గౌతమ్ నీ దగ్గర తీసుకుని మాట్లాడుతూ బాధలో ఉన్న మహేష్ బాబుని కాసేపు బాలయ్య నవ్వించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  నిన్నటి నుండి తడిసిన కళ్ళతో చాలా మౌనంగా… దిగాలుగా ఉన్న మహేష్ బాబు ని దగ్గరకు తీసుకుని బాలయ్య.. కాస్త నవ్వించడంతో సూపర్ స్టార్ అభిమానులు బాలయ్య కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నివాళులర్పించిన అనంతరం కృష్ణ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చిత్ర సీమకు ఆయన ఎన్నో సేవలు అందించారని పద్మాలయ స్టూడియో స్థాపించి గొప్ప సినిమాలు తీశారని కొన్ని ఆడారు. కృష్ణా నిర్మాతల పాలిట కల్పవృక్షం. ఇండస్ట్రీలో కొత్త దర్శకులు మరియు నిర్మాతలను ఎన్టీఆర్ అదేవిధంగా కృష్ణలే పరిచయం చేశారు. ఆయనతో సుల్తాన్ సినిమా చేయడం జరిగింది. షూటింగ్ కోసం అండమాన్ వెళితే అక్కడ నాన్నగారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ మరియు ప్రశ్నలు స్ఫూర్తి ప్రదాతలు అని బాలకృష్ణ కొనియాడారు.

Share it:

CINEMA

Post A Comment: