తెలంగాణలో బిజెపి నిరంకుశ విధానాలను ఎండగడతాం....
-మండలంలో ప్రతి కార్యకర్త పార్టీ నిర్మాణంలో భాగస్వామి కావాలి.
-మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు.
మన్యం న్యూస్, మణుగూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఎండగట్టాలని మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు అన్నారు. ఆయన బుధవారం మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు ముత్యం బాబు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలోని మంత్రులపై బిజెపి నిర్వహిస్తున్న ఏకపక్ష ఈడి దాడులను ప్రజలు పెద్ద ఎత్తున నిరసించాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో బిజెపి మోసపూరిత విధానాలను ఎండగట్టాలన్నారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎడల సవతి తల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. ఇటీవల సాక్షాత్తు తెలంగాణ శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారం అత్యంత దుర్మార్గమైందన్నారు. రాజకీయ చరిత్రలోనే ఇంతటి నీచమైన చర్యకు బిజెపి పాల్పడటం అత్యంత దారుణం అని, దొడ్డి దారిన ప్రలోభాలను ప్రేరేపిస్తూ రాజకీయ విలువలకు తిరోధకాలు ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిసిగ్గుగా డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ నిత్యవసర వస్తువులను పెంచుతూ ప్రజలపై విపరీతమైన భారాలను మోపిందన్నారు. తెలంగాణ లో కెసిఆర్ నాయకత్వంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలను మండలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి తీసుకువెళ్లాలని, అందుకు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కంకణ బద్దులు కావాలన్నారు. ఈ సమావేశం లో ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షులు కురి నాగేశ్వరరావు, అసంఘటిత రంగాల నియోజకవర్గ నాయకులు కత్తి రాము, నాయకులు మల్లికార్జున్, మేకల రవి, పప్పుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: