మన్యం న్యూస్, మణుగూరు: మండల టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మార్పిఎస్ జిల్లా నాయకులు సిద్దెల తిరుమలరావును టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గంగారపు రమేష్ బుధవారం పరామర్శించారు. మోచేతికి కనితి కావడంతో మణుగూరు ఏరియా వంద పడకల ఆసుపత్రి లో ఆపరేషన్ జరిగింది. దీంతో తిరుమలరావు నివాసమునకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ డైరెక్టర్ బోయిళ్ళ రమణయ్య, పార్టీ మండల మహిళా కోశాధికారి చెరుకు సుధ, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కన్నగంటి వేణు, ఆకునూరి సతీష్, కొడారీ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: