మాధవేని రఘునందన్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం దుబ్బకాకు చెందిన ఎమ్మెల్యే (ఉప ఎన్నిక 2020 లో గెలిచింది). తెలంగాణ రాష్ట్ర భావజాలానికి ఆయన బలమైన మద్దతుదారుగా పేరుపొందాడు.
వృత్తిరీత్యా న్యాయవాది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ నాయకత్వం మోదీ రాకను పురస్కరించుకుని బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రధాని మోదీకి అపురూపమైన కానుకను బహూకరించారు. ప్రధాని మోదీ చెంత శ్రీరాముడు ఉన్నట్టు ఈ పటంలో చిత్రించారు.
ఈ విశిష్ట కానుక అందుకున్న మోదీ ఎంతో సంతోషించారు. రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మునుగోడులో ఓటమిపాలైనప్పటికీ తెలంగాణ బీజేపీ శ్రేణులను మోదీ అభినందించారు. నికార్సయిన పోరాటం కనబరిచారంటూ కొనియాడారు. మున్ముందు కూడా ఇదే తరహాలో పోరాడాలంటూ ప్రోత్సాహ వచనాలు పలికారు.
Post A Comment: