గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని, పెరిగే ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను 26 వేలుగా సవరించి అమలు చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మణుగూరు ఎండివో కార్యాలయంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు ఎండీ. గౌస్, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు డి. వీరభద్రం, ఎం. నాగార్జున, ఎం. నరసింహారావు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: