CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమ్మక్క సారక్క గద్దెలు నిర్మాణాన్ని నిలిపివేసిన ఫారెస్ట్ అధికారులు.....సమస్యను ఎమ్మెల్యే మెచ్చా దృష్టికి తీసుకువెళ్లిన సర్పంచ్ సాదు జోత్స్నాభాయ్

Share it:



 మన్యం న్యూస్, అశ్వారావుపేట: మండలంలోని ఊట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పాపిడి గూడెం గ్రామంలో సత్తెమ్మ గుడి వద్ద గ్రామస్తులు సమ్మక్క సారక్క గద్దెలు నిర్మింపదలచి పనులు ప్రారంభించగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని నిలిపివేశారు. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని అనడంతో విషయాన్ని అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్లినట్లు ఊట్లపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ సాదు జోత్స్నాభాయ్ తెలిపారు. పాపిడిగూడెంలో కొలువుదీరిన సత్తెమ్మ గుడి వద్ద గత 100 సంవత్సరాలుగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజించుకుంటున్నారని, చుట్టుపక్కన గ్రామస్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని అంత ప్రాచుర్యం కలిగిన గుడి వద్ద సమ్మక్క సారక్క గద్దెలు నిర్మాణాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం పద్ధతి కాదని సమస్యను వినిత పత్రం ద్వారా ఎమ్మెల్యే మెచ్చా దృష్టికి తీసుకెళ్లగా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపిడి గూడెం గ్రామ వార్డు మెంబర్స్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: