CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తొమ్మిది నెలల బకాయి వేతనాలు చెల్లించాలి కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోచుకోవడం సరికాదు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 05... మాతా శిశు ఆసుపత్రిలో  9 నెలలుగా పనిచేస్తున్న కార్మికుల వేతనాలు సంబంధిత కాంట్రాక్టర్ తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ డిమాండ్ చేశారు . శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలో గుత్తుల మాట్లాడారు. ఆసుపత్రి ప్రారంభం నుంచి పనిచేస్తున్న కార్మికుల వేతనాలు చెల్లించకపోవడం సరి కాదని వారి శ్రమ దోచుకుంటున్న కాంట్రాక్టరుపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారంగానే వారి వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో ఏఐటియుసి కార్మికుల పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహీమ్ దాదా, మోతే కృష్ణ, రణధీర్, శివ, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: