మన్యం న్యూస్,భద్రాచలం:భద్రాచలం
జూనియర్ కళాశాల సెంటర్లోని శ్రీ సాయినాధుని మందిరంలో కార్తీకమాసం రెండవ గురువారం పురస్కరించుకొని బాబా వారికి పాలతో అభిషేకం జరిపారు. నూతన వస్త్రాలు అలంకరించి స్వర్ణ ఆభరణాలు ధరింపజేశారు. అష్టోత్తర నామార్చన జరిపారు.
కార్తీక మాసం గురువారం సందర్భంగా బాబా వారి సన్నిధి, పూల అలంకరణ చేశారు. కీర్తిశేషులు కురిచేటి పాండురంగారావు గారి సతీమణి రాజకుమారి మరియు కుటుంబ సభ్యులు అన్నదానం జరిపారు.
అన్నదానం దాత కురిచేటి శ్రీనివాసరావు దంపతులను కోశాధికారి కుంచాల రమేష్ శాలువాతో సత్కరించారు.
అయ్యప్ప స్వాములు, భక్తులు 2500 మంది అన్నదానంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తుమ్మలపల్లి సతీష్, కురిచేటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: