మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వానల కారణంగా డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున అన్ని పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో శానిటేషన్ పనులను ప్రారంభించాలని, అదేవిధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేకు పూర్తిగా సహకరించి సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులను కోరడం జరిగింది. ప్రతి ఒక కార్యదర్శి వారికి నిర్దేశించిన పనులను సమయ అనుకూలంగా పూర్తిచేసి, సమర్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Post A Comment: