మన్యం న్యూస్ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా. కాంతారావు ఆదేశాల మేరకు మండల పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగ ఆధ్వర్యంలో కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీజిల్ పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా కరకగూడెం పెట్రోల్ బంకు వద్ద నుండి తహసీల్దారు కార్యలయం ద్విచక్ర వాహనాలు (బైకులు) నెట్టుట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల దిలీప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని వారు అన్నారు మధ్యతరగతి కుటుంబాల జీవన స్థితిగతులను దెబ్బతీసే విధంగా గ్యాస్ ధరలను పెంచి చోద్యం చూస్తుందని బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉనాయని అన్నారు.ప్రతి ఒక్కరూ నిరసన కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: