మన్యం న్యూస్, కరకగూడెం: పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఏజెన్సీ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని తుడుం దెబ్బ నాయకులు సిద్ధబోయిన.శ్రీకాంత్ అన్నారు.అలాగే ఏజెన్సీ మండలాలతో ఏజెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని,దిని వలన పోలీస్ ఉద్యోగాలకు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏజెన్సీ సర్టిఫికెట్ల కోసం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాలకు వెళ్లి ఏజెన్సీ సర్టిఫికెట్లు అడుగుతే జీవో నెంబర్ 3 క్రాస్ కావడం వలన సర్టిఫికెట్లు ఇవ్వడం కుదరదు మీకు పూర్తి సమాచారం కావాలంటే ఐటీడీఏ పీవో జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి అడగండి అంటు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అన్నారు.గిరిజన అభ్యర్థులకు ఏజెన్సీ సర్టిఫికేట్ ఉండటం వలన ఎత్తు (హైట్)లో సడలింపు ఉండటం జరుగుతుందని అన్నారు. ఐటిడిఏ పీఓ,జిల్లా కలెక్టర్ దృష్టి సారించి గిరిజన ఆదివాసి పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏజెన్సీ సర్టిఫికెట్ ఇప్పించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తరపున కోరుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు సూతరి.నాగేశ్వరరావు,కొమరం వెంకటేశ్, గొగ్గలి.రామకృష్ణ దొర, కొమరం. శ్రీను,వినయ్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: