భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.
👉 ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ ...
ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమన్నారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం,కేదారీశ్వర వ్రతాలు చేయడం కూడా దీపావళి పండగ విశిష్టత అన్నారు. ప్రజలందరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొవాలని ఆయన సూచించారు, సీఎం కేసీఆర్ గారు దిశా నిర్దేశంతో మంత్రివర్యులు & పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారి సారథ్యంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది అన్నారు.
Post A Comment: